27 అక్టో, 2010

హైదరాబాదులో కథా వర్క్ షాప్

అక్టోబర్ వతేదిన హైదర్ గూడా ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్ లో వారధి రచయితల వేదిక తరపున కథా వర్క్ షాప్ జరిగింది. సదస్సులో తుమ్మేటి రఘోత్తం రెడ్డి,గుడిపాటి,వాసిరెడ్డి ణావిన్ జాజుల గౌరీ,గోగు శ్యామల,ఖదీర్ బాబు,షరీఫ్,రాజ్యలక్ష్మి,సమతా రోష్ని,ఉమామహేశ్వర్ ,తాయమ్మ కరుణ,విజయలక్ష్మి,సా వెం రమేష్ బాబు,శ్రీనివాసరెడ్డి,స్కైబాబా ,పూదూరి రాజిరెడ్డి,రహంతుల్లా,వెంకటేష్,మొదలైన వారు పాలుగొన్నారు

ఇవాల్టి కథకులు ఎదుర్కొంటున్న సమస్యలు ,కథా రచన పరిణామాలు,మొదలైన విషయాలు చర్చిం చారు.
వారధి కథా సంకలనం ,కొత్త తరాన్ని కథల్లోకి ఆహ్వానించే అవసరాన్ని ,దానికి అవసరమైన మార్గాలను అన్వేషిం చడములో వారధి తనవంతుగా తన బాధ్యతను నిర్వహిస్తూ అనేక ప్రాంతాలలో వర్క్ షాప్ లనూ కథల పోటీలను నిర్వహించ దలచామని వారధి రచయితలూ అందరూ ఏక గ్రీవంగా తెలియజేసారు.రాబోయే కాలములో కథా సంకలనాలను ప్రచురించడము పంపిణి చెయ్యడమూ ఇంకా విస్తృతంగా చెయ్యాలని సమావేశం తీర్మానిం చింది.ఈ సమావేశానికి విచ్చేసిన అతిధులందరూ వారధి అభివృద్దికి తగు సలహాలూ ,సూచనలూ అందజేశారు.

1 కామెంట్‌: