23 డిసెం, 2009

ఈరాజకీయ దివాలాకోరుతనము కాదా

అంతా లోపాయకారితనమే. ఒక వైపు తెలంగాణా ఇస్తాము అనడము .ఇంకో వైపు సమైక్య ఆంధ్రా ఉద్యమానికి పొగపెట్టడము .లో గుట్టు పెరుమాళ్లకు ఎరుక .అన్నట్లుగా ఉంది ఆంధ్ర రాష్ట్రము లో రాజకీయ తతంగం .ఇవ్వాల్సినహక్కులు ఇచ్చేస్తే ఎంతో కాలముసంపాదన అంతా పోతుందన్నది సమైక్య వాదుల బాధ .ఇప్పటి దాకాసంపాయించినది మునిమనవళ్ళ దాకా సరిపోతుందిలే అనుకుని వొదిలి పెట్ట వచ్చు కదా 'అదేం కుదరడం లేదుఎందుకంటే అధికార దాహం.దీని కోసం ఎవరినైనా వొదులుకునే రాజకీయ నాయకులు ముందూ వెనుకా ఆలోచించేపరిస్తితిలో లేరు .
తెలంగానాలో నిరాహార దేక్ష ఎంత ఫార్సు గా జరిగిందో అంతకంటే వెయ్యిన్నొక్క రెట్లు నాటకాల వాళ్ళు రాయలసీమఆంధ్రా లో బయలు దేరారు .అందరు బజారునపడి కొట్లాడుతున్న తెర వెను రాజకీయం తెర వెనుకే జరుగుతుందిఅర్ధం కాని అర్ధం చేసుకోలేని సామాన్యుడే ఇప్పుడు అమాయకుడు.
తెలంగాణా వాళ్ళకేదో అన్యాయం జరుగుతున్దంట కదా వాళ్ళ మానాన వాళ్ళని వదిలి వేద్దామంటే అయ్యో ఇన్నిసంవత్సరాలుగా అభివృద్ధి చేసిన హైదరాబాద్ ని వొదిలి పెట్టడమా ససేమిరా అంటున్నారు సమైక్య వాదులు.అంటే ఏదోపోతున్దనేగా;ఏమి పోతుంది.ఎవరిది పోతుంది.ఎంతవరకు పోతుంది. ఇది సామాన్యుడికి అర్ధం కాని ప్రశ్న .సరే తెలంగాణావచ్చింది అనుకోండి ఎవరికీ వొరుగుతుంది అంటే అక్కడ సామాన్యుడికి అర్ధం కాకుండానే ఉంది.ఒక వేళ ఇస్తే అప్పుడుకూడా సామాన్యుడికి కొట్లాట ఎట్లాగూ తప్పదు .కాకుంటే ఈసారి తెలంగాణా పెట్టుబడిదారులతో .అంటే మొత్తంమీద ఉద్యమం కూడా ప్రజల చేతులలో లేదు.కేవలం నాయకులు ఆడుకుంటున్న జూదంలో సామాన్యులు నలిగిచస్తున్నారు.అయితే వీటి మధ్య మేధావులు కూడా అర్ధం లేని వత్తాసులు పలకడం బాగా లేదు.
మధ్య మధ్యలో రకరకాల పాత్రధారులు రకరకాల వేషధారులు ,రంగురంగుల పార్టీలూ అన్ని రంగంలోకి దూకిపోఇన పదవులూ వస్తాయనుకున్నసింహాసనాలూ అన్నిటిని తలుచుకుని తలుచుకుని వెక్కిళ్ళు పెడుతూ మరి రోడ్లపాలయ్యారు .వీళ్ళుఅయితే అయ్యారుకాని ఏమి తెలియని అమాయకులను కూడా రోడ్ల పాలు చేసారు. మద్యలోఅత్యుత్సాహం ప్రదర్సించే కొందరు అమాయకులు ప్రాణ త్యాగాలూ బలిదానాలూ అంటూ ఆహుతి అవుతూ ఉన్నారు.
మా అభిప్రాయం చెప్పేసాము మీరే తన్నుకుచావండి అంటూ పైనున్న కామందుల వారు తెలియనట్టు చూస్తూదోబుచులాడుకుంటున్నారు.ఏది ఏమైనా తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కేంద్రం అనుకూల అననుకూలపరిస్తితులూ వారిని పరిపాలించే ప్రపంఛ బాంక్ అధిపతుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎవరు ఏం ఛేసినా ఎవరికీ లాభనష్టాలు వచ్చినా ముమ్మూర్తులా నష్టపోయేది మాత్రం సామాన్యుడే. బందులూదిక్షలలో నష్టపోయిన మొత్తాన్ని సామాన్యుడి నెత్తి మీద ధరల రూపములో పడడం మాత్రం ఖాయం. పాపం ఎవ్వరిదనిఅందరూ ప్రశ్నించాలి .అందుకే ఏదైనా ప్రజలే గోదాలోకి దిగే సాధించుకోవాల్సిందే కాని రాచకీయ నాయకులప్రాపకంతోనో,జాలీ దయల్తోనో వస్తుంది అనుకుంటే అంతా వొట్టి మాయా బజారే.
. .