17 ఏప్రి, 2011

శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక,సేవా సమితి

ఒంగోల్లో కొంతమంది మిత్రులం కలిసి శాంతివనం ఫౌండేషన్ స్థాపించాము. దీని ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటుగా వాళ్ళలో వున్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం,కథా సాహిత్యం చదివించడం,కథలు రాయించడం,మంచి పిల్లల సినిమాలు చూయించడం ,వాటి గురించి విశ్లేషణలు రాయించడం చేశాము పాఠశాలల్లో గ్రంథాలయాలు ప్రారంభించడం వంటి కార్యక్రమాలతో పాటుగా పేదపిల్లల ను దత్తత తీసుకుని వాళ్ళను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను కూడా తీసుకుని కాలక్రమములో శాంతివనం సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం గా ఈ ఫౌమ్దేషణ్ ప్రారంభించాము. అక్కడ నుండే ప్రతిభావంతులైన ,బాధ్యతాయుతమైన పౌరుల్ని ,సామజిక బాధ్యత కలిగిన పిల్లలుగా తీర్చిదిద్దే బాధ్యత శాంతివనం స్వీకరించింది. ఇంకా భావ సారూప్యత కలిగిన మిత్రులను కూడా భాగస్వాములను చేసే వుద్దేశంతో సభ్యులనుగా చేర్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఈ సంస్థలో భ్హగాస్వాములు కావచ్చు,s