1 అక్టో, 2010

ఒంగోల్లో కథారచయితల వర్క్ షాప్

అక్టోబర్ రెండో వారంలో ఓంగోల్లో రెండు రోజుల కథా వర్క్ షాప్ జరిగింది .అల్లం రాజయ్య,ప్రతిమ ,సమతా రోష్ని ,మొలకలపల్లి కోటేశ్వరరావు ,వి చెంచయ్య ,జి. కళ్యాణరావు ,రుక్మిణి ,వరలక్ష్మి' రాజ్యలక్ష్మి సజ్జా ,విజయలక్ష్మి ,తాయమ్మ కరుణ ,చిన్నయ్య ,రాఘవరెడ్డి ,కరుణ మొదలైన కథా రచయితలూ ,నూతన కథారచయితలు ,ఈ వర్క్ షాపులో పాలుగొన్నారు .రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమములో ఎనిమిదిమంది కథకులు తమ కథలు చదివి వినిపించారు .వాటిపై అందరూ తమ అభిప్రాయాలు చెప్పగా కథకులంతా ఉత్సాహంగా స్వీకరించారు .ఇలాంటి కార్యక్రమాలు ఇలాగ జరుగుతాయని తెలియదని ఎంతో ఉద్వేగంగా చెప్పారు .కథలపై మాండలికాలపై ,కథనంపై ,శిల్పం పై చర్చ జరిగింది.రెండవ రోజు కొత్తపట్నం బీచ్ లో సముద్రము వొడ్డున సమావేశములో కథకులు తమ కథలను ఉత్సాహంగా చదివారు .
ఈ వర్క్ షాప్ స్పూర్తితో వారధి సహకార వేదిక ఆధ్యర్యంలో పలు వర్క్ షాప్ లను జరపాలని నిర్ణయించుకున్నాము .అక్టోబర్ ౩ వ తేదీన హైదరాబాదులో బషీర్ బాగ్ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి