3 జులై, 2010

సాహిత్యం మనిషికి జ్ఞానాన్ని ఇవ్వాలి కదా !

మన తెలుగు సాహిత్యంలో ఇవాళ ఏం జరుగుతుందో చూస్తుంటే ఎంతో బాధ పడాల్సి వస్తుంది. సాహిత్యం అంటే కేవలం సభలు ,సన్మానాలు, పొగడ్తలు,అవార్డులు ,సత్కారాలు ,గ్రూపులు ,చీత్కారాలు, పగలు,ప్రతీకారాలు,పరిచయాలు,ఇలాగ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పొతే అంతూ పొంతూ ఉండదు. మరి ఎవరికో ఏదో చెప్పాలని, ఎవరినో సంస్కరించాలని,ప్రస్తుతాన్ని సహజంగా మనిషికి అవగాహన కావించాలని సాహిత్య కారులుగా నడుం కట్టిన మనమే ఇన్నిన్ని ప్రలోభాలకు,ప్రభావాలకు లోనైతే మరి మన పాటకుల సంగతి ఏమిటి ?ఇలాగే పరిస్థితి కొనసాగితే పుంఖాను పుంఖాలుగా వస్తున్న సాహిత్యాన్ని బలవంతంగా వాళ్ళపై రుద్దితే సామాన్యులు పాపం వాళ్ళు ఏమై పోతారు తప్పకుండా మళ్ళి మనందరం ఒక్కసారి వెనక్కు తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది మన కోసం మన తెలుగు వాళ్ళ కోసం మన సాహితి కారుల కోసం, ఇవాల్టి తరం కోసం కూడా .

2 కామెంట్‌లు:

  1. అవున్లే!

    'మనలాంటివాళ్ళం' పాపం 'పాటకుల' గురించి యేమాలోచిస్తాం!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి