18 జూన్, 2010

మన ప్రభుత్వాలు సిగ్గుపడేది ఎప్పుడు?

కోట్ల రూపాయలు,వందల ఎకరాలు,వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు,ఇంకెంతోమంది కార్మికులు రేయింబవళ్ళూ శ్రమిస్తున్నారు మహానాడు విజయవంతం చేయడం కోసం. ఇది ఏ పార్టీజరిపే మహానాడు కాదు. ఒక భాష కోసం మన పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం తమిళ భాష కోసం జరిపే మహానాడు.ఐదు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో పాల్గొనడానికి ప్రపంచములో ఉండే 50 దేశాల నుండి అనేక లక్షల మంది తమిళులు హాజరు అవుతున్నారు.
ఒక పాట ఒకే ఒక్కపాట కోసం 70 మంది గాయకులు,పరిశ్రమలోని సంగీత దర్శకులు అందరూ తలిళ జాతి ఔన్నత్యం కోసం ప్రాచీన తమిళ కవుల గొప్పతనాన్నిచాటేలా ముఖ్యమంత్రి కరుణానిధి, వాలి,వైరముత్తు లాంటి వారి సహకారంతో రాసిన పాటను రూపొందించటానికి రాత్రింబవళ్ళూ శ్రమించడం,స్వయంగా ఏ.ఆర్. రహమాన్ పాట పాడడానికి పూనుకోవడం నిజంగా ఆ భాష చేసుకున్న పుణ్యం ఆ అభిమానులు ఆ మట్టి ,ఆ సంస్క్రుతి కలకాలం నిలిచి ఉండడానికి ఆ భాషే వాళ్ళను కలకాలం కాపాడుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.
ఆ పడుగను ఆ రాష్ట్రమంతా కన్నుల పండుగగా చేసుకోవడానికి ప్రజలంతా సమాయత్తమవుతున్నారు.మరి వాళ్ళు భాషను అంతగా ప్రేమిస్తున్నారు .
అదే అదే మాభాష
జయహే జయహే జయహే అంటూ మన పొరుగున ఉన్న మన సోదరులు ఉప్పొంగిపోతున్నారు.మరి మనం... మన ప్రభుత్వాలు సిగ్గుపడేదెప్పుడు?

4 కామెంట్‌లు:

  1. manollu eppudu siggupadataaro nenu chepthaanu meeeru vinandi

    1. ika ye project lonaina vandala kotlu dobbalenappudu

    2. raashtramlo bandh lu jarapalenappudu

    3. prajalni edavalni cheyalenappudu

    4. deshaanni ika ye maatram naasanam cheyalenappudu


    dayachesi veetini chadivi navvakandi ivi nijaaalu

    రిప్లయితొలగించండి
  2. పొరా బాబు .. ఇన్ని కబుర్లు చెప్తావు .. తెలంగాణా ఉద్యమంలొ కీలక పాత్ర పొషిస్తున్నావు. మాకు తెలీదనుకుంటున్నావా?

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత గారూ ఎవరైనా న్యాయం గురించి మాట్లాడితే తప్పులా భావించే మీలాంటి సంకుచితత్వం అందరకూ ఆపాదిమ్చకండి

    రిప్లయితొలగించండి