8 నవం, 2011

అజయ్ ప్రసాద్ కథల గురించి

ఏ నక్షత్రం లో పుట్టేడో కానీ కథల్ని సొంతంగా చూసింది చూసినట్టురాస్తున్నాడు అజయ్ ప్రసాద్ మృగశిర అయినా చిత్త కార్తె అయినా వున్నదివున్నట్టురాయడం మామూలు విషయమేమీకాదు.రాయడం లో కూడా వేదాంతంరాస్తున్నట్టుగానే రాయడంఇంకా గొప్ప విషయమే .అటు బెల్లిగువ్వ ఇటు జెముడుకాకి కూడా తత్వం మాట్లాడుతున్నట్టుగానే వున్నాయి.రెండు పక్షుల మధ్యసంభాషణని కథ రూపంలోకి తేవడం ,పక్షులు మాట్లాడుతున్నవి అనే విషయంమర్చిపోయి పాఠకుడు కథలోకి పొవాలంటే వాతావరణం చాలా పకడ్బందీగా వుండాలి. అయినా మృగశిర ని కథ చేశాడు.ఆ కథ కూడా చదివే కొద్దీ ఆయువు పట్టు మీదగురి చూసి కొట్టి నట్టు వుంది. సన్యాసుల మధ్య సంభాషణలైనా,శాస్త్రవేత్తలు ఎగిరే పళ్ళాలు గురించిఅయినా మల్టీమిలియన్ కంపెనీల సియీవోలు మాట్లాడుకుంటున్నా అదేందో అక్కడేకూర్చుని వాళ్ళు మాట్లాడుకునేవి విని రాసినట్టు రాస్తాడు.ఎక్కడా ఒక్కవాక్యం తియ్యడానిక్కానీ ఎయ్యడానిక్కానీ వీలుండదు.ఒక వాక్యం చదావక పోతేఏదో పోగొట్టుకున్నట్టుగా వుంటది. కథ చదువుతూ చదువుతూ కాసేపు అలా శూన్యంలోకి చూసి కాసేపు కళ్ళుమూసుకుని ఏవో జ్ఞాపకాల్ని నెమరేసుకుని మళ్ళీ కథలోకిజొరబడదామనిపిస్తుంది.ఒక కథ చదివి అలా పక్కన పెడితే ఏదో జీవన ఆంతర్యంబోధపడుతున్నాట్టూగా అనిపిస్తది.లోలోపల లోతులేవో బూడుతున్నట్టుగా వుంటది. పరుగెత్తుతున్న మనుషులు ఎందుకు పరుగెత్తుతున్నారో అర్థమై ఆ పరుగేఆపేద్దామనిపిస్తది.కదలకుండా కూర్చున్నోడికి నేనెందుకు జడ పదార్థంలాకూర్చున్నానోనని లేచి నడక సాగిద్దామనిపిస్తది. మొత్తానికి కథలంటే ఇలాంటి జీవిత సత్యాల లాగా వుండాలేమో కథలంటేకాకమ్మలు,పిచ్చుకమ్మలు చెప్పినా అచ్చమైన జీవితాల్లాగా వుండాలేమోఅనిపిస్తుంది.అజయ్ ప్రసాద్ ప్రకాశంజిల్లా కన్న బిడ్డ అయినా సాహిత్యానికిజీవితానికి ఎల్లలేమిటి.కథ కథే కథ జీవితమే కదా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి