26 ఏప్రి, 2010

"పాఠకుల సంఖ్య పెరగడమేలా"

మనిషి తాను ఏ పరిస్థితులలో ఉన్నా తన మనుగడ సాగించడానికి ,తన జీవన యాత్రలో సంభవించే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి ప్రాపంచిక జ్ఞానం అవసరం .మనిషికి జ్ఞాన్నిచ్చే ప్రధానమైన మార్గాలలో పుస్తకం ఒకటి .ఇవాళ ప్రత్యేకించి మన రాష్ట్రంలో టివీ ,సినిమా ,ఇతర ఆదాయ వనరులు, అనేక వ్యాపకాల వల్ల మనుషులు పుస్తకానికి దూరం అయ్యారు. ఈనాటి ఇంగ్లీషు చదువులవల్ల ఒక తరం సర్వ నాశనం అయిపోయింది .దీంతో ఎన్నోరకాల సమస్యలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి . మనుషుల్ని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తున్నాయి .వీటి నుండి బయట పడాలంటే మళ్లీ పుస్తకం వైపు అడుగులు పడాల్సిందే .
ఇప్పటికే పిల్లల సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వెలువడుతూ ఉండడముతో పిల్లలు నెమ్మది నేమ్మదిగా పుస్తకము వైపుకు మరలారనే అనుకోవాలి. కాని ఈనాటి విద్యా విధానంవల్ల, తల్లిదండ్రుల ప్రలోభం తారాస్థాయికి చేరుకుంది.ఎక్కడ పిల్లలు సాహిత్యం చవితే కాలము వృధా అయి పోయి ర్యాంకుల్లో వెనుకపడి పోతారనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారు. వాస్తవానికి మనం గమనించాల్సింది పిల్లలు ఎంత సృజనాత్మకంగా ఉంటే చదువులో కూడా అంత ముందు ఉంటారు .పుస్తకాలను ఎంత చదివితే చదువులోనూ ,జీవితములోనూ అంత ముందు ఉంటారు.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులూ ,కవులూ, సాహిత్యవేత్తలూ, అలా అనుకునెవాళ్ళూ కూడా వాళ్ళ పిల్లలకూ సాహిత్యం అలవాటు చెయ్యడం లేదు. కొంతమంది సాహిత్యకారులైతే సాహిత్యం చదివే పిల్లల్ల్ని సైతం మానిపించి పుస్తకాలకు దూరంగా ఉంచారు .సాహిత్యం ద్యారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళకు మనపిల్లల దగ్గర నుండే మొదలు పెట్టాలి.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులు,కవులు,సాహిత్యవేత్తలు అనుకునేవాళ్ళూ వాళ్ళ పిల్లలకు సాహిత్యం అలవాటు చెయ్యడము లేదు.కొంతమంది సాహిత్యకారులు సాహిత్యం చదివే పిల్లల్ని సైతం చదవడంమాన్పించి పుస్తకాలకు దూరంగా ఉంచుతున్నారు.చాలామంది సాహిత్యం ద్వారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళ దగ్గరనుండే మొదలు పెట్టాలి అనుకోవడంలేదు.
ఇవాళ పాఠకుల సంఖ్య చాలా తగ్గిపోయింది అని అందరం బాధపడుతున్నాము.రాష్ట్రం మొత్తం మీద సాహిత్యానికి సంబంధించి వివిధ రంగాలలో ఎన్నో వేల మంది ఉంటారు.వీళ్ళు రోజూ కలుసుకునే పిల్లలు,వీళ్ళు రోజూపాఠ్యాంశాలు బోధించే పిల్లలు ఎంత మంది ఉంటారు.రోజువారీ పాఠ్యాంశాలలో భాగంగా ఒక కథనో,కవితనో,పాటనో,పద్యాన్నో పిల్లలకు వినిపిస్తే భాషమీద ఎంత మమకారం పెరుగుతుంది.అక్కడ నుండేకదా పాఠకుడు మొదలయ్యేది.రచయిత ప్రారంభమయ్యెది.అలానే ప్రతి సాహిత్యకారుడూ మొహమాటానికి పోకుండా తాను ఉండే ఆఫీసులోనో ,తాను పనిచెసే శాఖలొనో ఎందరినో ప్రభావితమం చెయ్యొచ్చు.మొహమాటానికి కొందరు ఆమోదించినా కొందరైనా నిజం తెలుసుకునే వాళ్ళూ ఉంటారు. వాళ్ళద్వారా వాళ్ళ పిల్లల్ల్ని వాళ్ళ ఇంటిలోని వారిని కూడా ప్రభావితం చెయ్యొచ్చు.
మనిషి తలుచుకుంటే ఏపనినైనా సాధించవచ్చు.అయితే ఎవరో చేస్తారు, అందాకా వేచి చూద్దాం అనే ఉదాసీనత మనుషుల్లొ స్థిరపడిపోయింది.అందుకే ఎందరో మేధావులూ, జ్నానులూ ఉండి కూడా ఎవరో అజ్నానులు ప్రతిపాదించిన విధానాలను ఆమోదించి అందరం ఆదారిలొనే తలలొంచుకుని ఏమీ తెలియనట్టు సాగిపోతున్నాం.మనపిల్లలందర్నీతలలు వంచేసి ఆ గాటనే కట్టేస్తున్నాం.వాళ్ళకు జీవితమటే ఎమిటో తెలియకుందా చేస్తున్నాం.ఎన్నాళ్ళీ దుర్మార్గాన్ని భరించుదాం.మనవంతుగా మనమూ ముందడుగు వేద్దాం.మీరూ ఆలోచించండి.

1 కామెంట్‌:

  1. బాగుంది,కానీ ఇంతకూ పాఠకుల సంఖ్యను ఎలా పెంచుతారో,పెంచబోతున్నారో చెప్పలేదు మీరు.అలాగే---సాహిత్యం ద్యారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళకు మనపిల్లల దగ్గర నుండే మొదలు పెట్టాలి" అన్నది అంత సులభమని భావిస్తున్నారా మీరు?

    రిప్లయితొలగించండి