16 మార్చి, 2010

తెలుగు సమాజాన్ని రక్షించుకుందాం

ఏ భాషా సమాజమైనా తన పిల్లలకు మాత్రుభాషలోనే విద్యాబోధన జరగాలని కోరుకుంటారు .కానీ మన తెలుగు సమాజం ఆంగ్ల చదువుల మోజుతో పిల్లలను నరకయాతన పెడుతున్నారు. నిజానికి మాతృభాషలో చదువు కుంటే ఏ భాషలోనైనా ప్రావీణ్యం పొందవచ్చు . అది మేము అనుభవంతో తెలుసుకున్నాము .అలా చదువుకున్న పిల్లలు ఆంగ్లం బాగా నేర్చుకోవడం గాక సృజన ప్రక్రియలో కూడా ముందే ఉంటారు .అది తెలియని పాలకుల నిర్ణయాలతో మనపిల్లలు పిచ్చివాల్లుగా మారి భవిష్యత్తు గురించి ఆలోచించే శేక్తి పోతుంది .ఇప్పుడు కూడా మనం ఆలోచించక పొతే మన పిల్లలను అజ్ఞానులుగా మన చేతులతోనే మార్చి వేస్తాం .మనం మేలుకుందాం .కనీసం ప్రాధమిక విద్యనైనా మన భాషలోనే నేర్పాలని అది రాష్ట్రమంతా అమలు జరిగేలాగా ప్రభుత్వమే చర్య తీసుకునేలాగా వత్తిడి తెద్దాం .మావంతుగా ఒంగోలులో రీడర్స్ క్లబ్ ,పిల్లల కథలు చదవడం,కొనిపించడం , పాఠశాలలకు వెళ్లి పిల్లలకు తెలుగు తీపి తెలియ చెయ్యడం ,యువకులతో తెలుగు చదివించడం ,పర్యావరణ అవగాహన కలిగించడం వంటి పనులతో ముందుకు నడుస్తున్నాం. మేరూ చెయ్యి కలపండి.మనం సాధిస్తాం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి