27 అక్టో, 2010

హైదరాబాదులో కథా వర్క్ షాప్

అక్టోబర్ వతేదిన హైదర్ గూడా ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్ లో వారధి రచయితల వేదిక తరపున కథా వర్క్ షాప్ జరిగింది. సదస్సులో తుమ్మేటి రఘోత్తం రెడ్డి,గుడిపాటి,వాసిరెడ్డి ణావిన్ జాజుల గౌరీ,గోగు శ్యామల,ఖదీర్ బాబు,షరీఫ్,రాజ్యలక్ష్మి,సమతా రోష్ని,ఉమామహేశ్వర్ ,తాయమ్మ కరుణ,విజయలక్ష్మి,సా వెం రమేష్ బాబు,శ్రీనివాసరెడ్డి,స్కైబాబా ,పూదూరి రాజిరెడ్డి,రహంతుల్లా,వెంకటేష్,మొదలైన వారు పాలుగొన్నారు

ఇవాల్టి కథకులు ఎదుర్కొంటున్న సమస్యలు ,కథా రచన పరిణామాలు,మొదలైన విషయాలు చర్చిం చారు.
వారధి కథా సంకలనం ,కొత్త తరాన్ని కథల్లోకి ఆహ్వానించే అవసరాన్ని ,దానికి అవసరమైన మార్గాలను అన్వేషిం చడములో వారధి తనవంతుగా తన బాధ్యతను నిర్వహిస్తూ అనేక ప్రాంతాలలో వర్క్ షాప్ లనూ కథల పోటీలను నిర్వహించ దలచామని వారధి రచయితలూ అందరూ ఏక గ్రీవంగా తెలియజేసారు.రాబోయే కాలములో కథా సంకలనాలను ప్రచురించడము పంపిణి చెయ్యడమూ ఇంకా విస్తృతంగా చెయ్యాలని సమావేశం తీర్మానిం చింది.ఈ సమావేశానికి విచ్చేసిన అతిధులందరూ వారధి అభివృద్దికి తగు సలహాలూ ,సూచనలూ అందజేశారు.

1 అక్టో, 2010

ఒంగోల్లో కథారచయితల వర్క్ షాప్

అక్టోబర్ రెండో వారంలో ఓంగోల్లో రెండు రోజుల కథా వర్క్ షాప్ జరిగింది .అల్లం రాజయ్య,ప్రతిమ ,సమతా రోష్ని ,మొలకలపల్లి కోటేశ్వరరావు ,వి చెంచయ్య ,జి. కళ్యాణరావు ,రుక్మిణి ,వరలక్ష్మి' రాజ్యలక్ష్మి సజ్జా ,విజయలక్ష్మి ,తాయమ్మ కరుణ ,చిన్నయ్య ,రాఘవరెడ్డి ,కరుణ మొదలైన కథా రచయితలూ ,నూతన కథారచయితలు ,ఈ వర్క్ షాపులో పాలుగొన్నారు .రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమములో ఎనిమిదిమంది కథకులు తమ కథలు చదివి వినిపించారు .వాటిపై అందరూ తమ అభిప్రాయాలు చెప్పగా కథకులంతా ఉత్సాహంగా స్వీకరించారు .ఇలాంటి కార్యక్రమాలు ఇలాగ జరుగుతాయని తెలియదని ఎంతో ఉద్వేగంగా చెప్పారు .కథలపై మాండలికాలపై ,కథనంపై ,శిల్పం పై చర్చ జరిగింది.రెండవ రోజు కొత్తపట్నం బీచ్ లో సముద్రము వొడ్డున సమావేశములో కథకులు తమ కథలను ఉత్సాహంగా చదివారు .
ఈ వర్క్ షాప్ స్పూర్తితో వారధి సహకార వేదిక ఆధ్యర్యంలో పలు వర్క్ షాప్ లను జరపాలని నిర్ణయించుకున్నాము .అక్టోబర్ ౩ వ తేదీన హైదరాబాదులో బషీర్ బాగ్ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము .

22 సెప్టెం, 2010

ఓంగోల్లో కథా రచయితల వర్క్ షాప్ సెప్టెంబర్ 11,12
















పసిపిల్లలతో వినాయక చవితి

వినాయక చవితికి పిల్లలతో మట్టి వినాయకుళ్ళను తయారు చేయించి వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులుగా పాలుగోన్నవారందరికి తెలుగు కథా పుస్తకాలను ఇవ్వటము జరిగింది.పిల్లలు తల్లి దండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమములో పాలుగోన్నారు .ఈ కార్యక్రమము డా "కొర్రపాటి సుధాకర్ గారి ఆధ్వర్యములో జరిగింది . నాగ భూషణము గారు మట్టి వినాయకుళ్ళ అచ్చులు తో బొమ్మలు తయారు చేసి అవసరమైన వాళ్లకు అండ చేసారు .

















29 ఆగ, 2010

ఊపిరి సలపని ఉత్కంఠ

ఊయల ఊగుతుందే
ముందుకూ వెనక్కూ
అల్లానే ఊగుతూ ఉండేదప్పుడు
నా గుండె కూడా అలసట లేకుండా
కవాటాలు తుత్తునియలు అయిపోతాయేమో
రక్తనాళాలు ఉత్కంఠ భరించలేక
విస్పోఠన చెందుతాయేమో నన్న
ఉత్కంఠ నిండి ఉండేది
అప్పుడు మోయడానికి
జ్ఞాపకాలు లేవు ఉట్టి గాయాలు తప్ప
అడుగు తీసి అడుగేద్దామంటే నిప్పులు కాల్తున్న భయం
అయినా సరే ఆపలేని మునివేళ్ళ మీద ప్రయాణం
ఒక్కోరోజు కుంపటి మీద కాగుతూ కూడా
పీడ కలల్ని భరించాల్సి వొచ్చేది
అప్పుడప్పుడైనా పంచుకుందామని దోసిలి నిండా
కలలు తీసుకునేవాణ్ణి
తల పైకెత్తి చూస్తే
కళ్ళ ముందు అంతా శూన్యం
ఎవరో చుట్టూ మూగి ఉన్నా
కళ్ల లోతుల్లో కనిపించని భావాల్ని
చదవలేని తడబాటు
గాయాల్నిలా మోసుకు తిరుగుతున్న కొద్దీ
కాలి బాట మరింత ఇరుకిరుగ్గా
ముళ్ళ పొదలతో తుప్పలతో
రాళ్ళూ రప్పలతో గీరుకుపోయిన
పచ్చి పుండు అయ్యేదేమో
ఇప్పటికైనా మేలుకోవడం మంచిదే అయ్యింది
ప్రాణాలైనా మిగిలి బ్రతికి బయట పడి పోయానుకదా

19 ఆగ, 2010

ఆనందోత్సాహం

చిగురుటాకంత స్నేహం కోసం

చినుకు రాలినంత ఆప్యాయతా సుమం కోసం

పువ్వు పుష్పించినంత వసంతం కోసం

గాలి సవ్వడంత ఆనందం కోసం

మరుమల్లెల సువాసనంత మధురిమకోసం

పుప్పొడి చప్పుడంత నిశ్శబ్దంతో

కలువల కళ్ళు విప్పార్చుకుని

ఆకాశంలో మబ్బుల్నీ

అవి వర్షించే వర్షపు ధారల్నీ

రెప్ప వాల్చకుండా వొచ్చే

చిరుజల్లుల వెన్నెల తెచ్చే

వర్షపు ధారల్నీ

ఒక ఆత్మీయుని ఆత్మీయత కొసం

ఇంకో ఆత్మ ఆర్థ్రంగా ఆప్యాయంగా

కళ్ళు కాయలు కాచేలా

చూపుల అగాధాల్లో

ఎదురు చూస్తూ చూస్తూ ఉండడం

ఎంత ఆనందోత్సాహమోగదా

17 ఆగ, 2010

బోసి నవ్వుల దేహ భాష

దిక్కు తోచని ప్రపంచపు
రోదనారణ్యాలలో
బోసినవ్వుల స్వర్గ దేహ భాషలు
ఏడుపులూ నవ్వులూ
అంతటా ఒకటే సంగీతం
నిద్రలోనూ మెలకువలోనూ
పెదవులపై అదే చిరు దరహాసపు
చెదరని లేలేత పువ్వుల భాష
ఎవ్వరూ పట్టని ఏ అవసరమూ లేని
ఉంగా ఉంగాల అందాల భాష
సాగుతూ ప్రాకుతూ
అదో విముక్త లోకపు మాయ భాష
పెదాలపై ఎప్పుడూ చెరగని చిరునవ్వుల చిలిపి భాష
స్వార్థాలసలే ఉండని కోపతాపాల్లేని ఒక్కటే కొంటె భాష
కడుపు ఖాళీ అయినపుడు మాత్రం ఆకలి భాష
సుస్తీ చేసినప్పుడైతే ఏడుపుల శోష భాష
ఇదో అద్భుతమైన అందాల అమాయక విశ్వభాష

10 ఆగ, 2010

శాంతివనం - సేవాసదనం

శాంతివనం - సర్వ సామాజిక సమ్మేళనం

ఎందరో అనాధలు అభాగ్యులున్నపుణ్యభూమి మనది.ఆ పుణ్యభూమిలో మనమూ పుట్టాం. పుట్టిన భాగ్యానికి మేమూ ఉన్నామనే విషయం గుర్తు చేసుకుందాం. మావంతుగా మేమూ ఎంతో కొంత సమాజానికి చేయూత నిద్దామని భావించాం.అందుకే ఒక అడుగు ముందుకు వేస్తున్నాం.అశాంతిలో ఉన్న సమాజానికి ఎంతో కొంత శాంతిని కలుగజేద్దామనే ఉద్దేశంతో ముందడుగు వేసి శాంతివనం స్థాపనకు పూనుకున్నాం.శాంతివనం ప్రథమ కర్తవ్యంగా అనాధ శిశువులకు చేయూతనిద్దాం అనుకున్నాం

ఎవ్వరూ నా అనేవాళ్ళు లేని పసిపిల్లలు ,అమ్మానాన్నా లేని అనాథలు ,పాపం పసివాళ్ళు వీళ్ళకు ఏదో దారి చూపించాలని మీకు అనిపిస్తే శాంతివనానికి తెలియజేయండి.5-10 సం: పిల్లల్ని బడికి పంపించి చదివించి వాళ్ళకు మేము చేయూత నిస్తాం. వాళ్ళకు మేమున్నామనే భరోసా కలిగిస్తాం.

సమాజములో కుళ్ళును కడిగి వెయ్యాలనుకునే వాళ్ళు,మానవత్వంతో స్పందించేవాళ్ళు,అనాధల పట్ల దయ కలిగినవాళ్ళు,అభాగ్యులను ఆదుకునేవాళ్ళుపిల్లల పట్ల ప్రేమ కలిగినవాళ్ళు,భాషాభిమానం కలిగిన వాళ్ళు,సంస్కృతి,సాహిత్యం,పర్యావరణం పట్ల అభిమానం ఉన్న వాళ్ళు మాతో చేయి చేయి కలపండి.అందరమూ కలిసి సమాజానికి చేయూత నిద్దాం.మనందరమూ కలిసి ఒక మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం.శాంతివనంలో సేవ, సంస్కృతి,సాహిత్యం,భాషా సంపదలను వెల్లివిరియజేద్దాం.

సంప్రదించడానికి:శింగరాయకొండ-9866343823 , ఒంగోలు-9949535695, మేఘ ఇ.ఎన్.టి.హాస్పిటల్.సుందరయ్య భవన్ రోడ్